Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Telangana దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..

దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..

by Satya
Revanth Reddy

దళిత, గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా..? లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025403
Total views : 147175

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.