దేశంలోని భద్రతా బలగాల కోసం డీఆర్డీవో(DRDO).. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరో పరికరాన్ని విజయవంతంగా పరీక్షించింది. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్(Bullet Proof jacket)ను అభివృద్ధి చేసింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా దీనిని రూపొందించింది. ఈ జాకెట్ 7.62 x 54 ఆర్ ఏపీఏ మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్డీవో ప్రకటనలో పేర్కొంది.
ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…
కొత్త ప్రక్రియలో నూతన మెటీరియల్ను ఉపయోగించి దీనిని రూపొందించినట్టు పేర్కొంది. కాన్పూర్లోని డీఆర్డీవో విభాగం డీఎంఎస్ఆర్డీఈ(DMSRDE) డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీనిని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామాగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇదేనని పేర్కొంది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చండీగఢ్(Chandigarh)లో విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్లా నడుపుతున్నారని ఎద్దేవా…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.