తెనాలి ప్రజాగళం సభ(Tenali Prajagalam Sabha)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఉత్సాహంగా ప్రసంగించారు. ఆంధ్రా ప్యారిస్ తెనాలికి చాలాసార్లు వచ్చాను కానీ, ఈ జనసందోహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా? అని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని తన ఆవేదన అదేనని అన్నారు. మైనారిటీలు, మహిళలు రాష్ట్రంలో ఇలా ఎవరూ బాగుపడలేదని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తిరుపతి పోలీసుల అవగాహన కార్యక్రమాలు.మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి…అనే నినాదంతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు, తనిఖీలను నిర్వహిస్తోంది. ఏపీ డీజీపీ హరీష్…
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్కల్యాణ్ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 212409