ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి.. దేశ ఖ్యాతిని మరో పెట్టు ఎక్కించిన గుకేశ్.. తెలుగు కుర్రాడు. ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. తండ్రి.. రజనీకాంత్. ఈయన పేరు మోసిన డాక్టర్. చెవి, ముక్కు, గొంతు సర్జన్. తల్లి.. పద్మ. ఈమె మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడటంతో.. గుకేశ్ 29 మే, 2006న చెన్నైలో జన్మించారు. తల్లిందండ్రులిద్దరూ మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు. కానీ, వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు సాధన చేసేవాడు. అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను ఎంతో ఆకట్టుకుంది. మెళుకువలు నేర్చుకున్న అనంతరం వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలు పెట్టాడు. ఇతనికి తొలి విజయం అంటే.. తొమ్మిదేళ్ల వయస్సులో 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2023.. గుకేశ్ తనను తాను ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసిన సంవత్సరం. గతేడాది ఆగస్ట్లో 2750 రేటింగ్తో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి 36 ఏళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి 40 ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విజయంతో భారత ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు.
విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత విజయంతో దేశం గర్వపడేలా చేశావని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చెస్ చరిత్రలో గుకేశ్ అతని పేరు చిరస్థాయిగా నిలవడమే కాకుండా యువతకు గొప్ప కలలు కనేందుకు మార్గం చూపావని ప్రధాని కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి