ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా సింగరాయకొండ కి చెందిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. అయితే శనివారం నియోజకవర్గానికి వస్తున్న సంధర్బంగా త్రిపురాంతకం, యర్రగొండపాలెం లో స్వాగత ఫ్లెక్సీలు ఎర్పాటు చేసారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. త్రిపురాంతకం లోని ఫ్లైఓవర్ కు ఫ్లెక్సీ ఎర్పాటు చేయగా ఫ్లెక్సీ ను చించి వేశారు. యర్రగొండపాలెం లో మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను చించి వేశారు. సీసీ కెమేరాలు లేని చోట ఫ్లెక్సీలు చించడంతో ఎవరో కావాలనే ఫ్లెక్సీలను చించారని వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దీంతో ఫ్లెక్సీల గొడవ యర్రగొండపాలెంలో చర్చాంశనీయంగా మారింది. ప్లెక్సీలను చించిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
Chief Minister Jagan Mohan Reddy
భోగి పండుగ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత గుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతం లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక తెచ్చిన చీకటి జీవోలను స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు తో కలిసి జీవో పేపర్లను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ గారు మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్బంగా నసీర్ గారు మాట్లాడుతూ పనికి రాని వస్తువులను, చేడు కలిగించే వస్తువులను భోగి మంటల్లో అహుతి చేసి మంచి చేకూరాలని అలాగే జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో అరాచక పాలన సాగించటానికి తెచ్చిన చీకటి జీవోలను ఈ రోజు భోగి మంటల్లో వేసి దహనం చేసి జగన్ రెడ్డి నియంత పాలనను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికి భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు గాలి సతీష్, యల్లవుల అశోక్, షేక్ రియాజ్, ఉస్మాన్, బట్టా రాజా, పఠాన్ జమీర్, గుడిపల్లి వాణి, వేములకొండ శ్రీను, మల్లెంపూడి శ్రీనివాస్, ఏలూరి నరేంద్ర, హఫీజ్, వీర్రాజు, రమేష్, కిరణ్, ఏడుకొండలు, పునయ్య, నాయుడు మల్లికా, సుఫియా, నాగ మల్లికా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు టికెట్ రాలేదన్న అసూయతో మూడు దపాలుగా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని దిక్కరించి మాట్లాడడం పై రాయదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు అంపారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశంలో వెల్లడి.
వైసీపీ యువనేత నవీన్ కుమార్ రెడ్డి కామెంట్స్:-
కాపు రామచంద్రారెడ్డి టికెట్ నెపంతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారు అనడం విడ్డూరం.
ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని 2009 నుండి 2019 వరకు మూడు దపాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందలేదా ? అన్యాయమైన దుర్మార్గమైన సర్వే అంటావా ? మీరు చేసిన అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి మీతో చర్చించ లేదా ఇది వాస్తవం కాదా ?
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన పార్టీ నాయకులను నీ స్వలాభం కోసం అడ్డొస్తారని, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయలేదా ?
నియోజకవర్గంలోని కనేకలు బొమ్మనహాలు మండలాల్లో కార్యకర్తలపై అక్రమ కేసులులో విరికించి హింసించలేదా ?
కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నావే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నీ వెంట ఎంతమంది ఉన్నారో చూసుకో!
రాయదుర్గం సబ్ రిజిస్టర్ ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని అధికారులను హింసించలేదా తద్వారా ఆరు నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వ నిధి గండి కొట్టలేదా?
రామచంద్ర రెడ్డి ఇప్పటికైనా ప్రజా సుపారీలకు పాలన కోసం వైయస్సార్ లో ఉండి ఐక్యత కోసం పోరాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనాలు గుండెల్లో ఉండాలి.
వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ వంద పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా డి ఎం హెచ్వో కొండయ్య, ప్రాంతీయ వైద్యశాల సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, ప్రముఖ సీనియర్ వైద్యులు బయా రెడ్డి, నారాయణ రెడ్డి లతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు, వైకాప నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పూర్ణ కుంభం తో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆసుపత్రి లో వివధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దినం చాల చారిత్రాత్మక దినం అన్నారు. వందపడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రావడంతో రాయచోటి ప్రజల చిరకాల కోరిక నేటితో నేరవేరిందన్నారు. ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాయచోటిలో పర్యటించినప్పుడు వందపడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకు స్థాపన చేశారన్నారు. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందన్న శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ ల సహకారంతో త్వరిత గతిన నిర్మాణాలను పూర్తీ చేసుకొని ఈ రోజు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే సిటి స్కాన్, 8 బెడ్లు ఉన్న డయాలసిస్ ను 20 బెడ్లకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి తోనే ఉంటాను. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను. వాటిని ఈ ఎల్లో మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేసారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి పార్టీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి గార్ల మేలు మరువను.






Total views : 91177