రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ‘రా కదలిరా’ పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హజరవునున్నారని ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని రాష్ట్ర స్థాయిలోను, ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోను ముఖ్యంగా యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంట లో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావ సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇంచార్జి లు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు.
Chief Minister Jagan
రామచంద్రపురం లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇంచార్జి పిల్లి సూర్య ప్రకాష్ లను యానాం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి అధికారిక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ బోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ కు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రియల్ గా, నిజాయితీ గా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎంపిక చేయడం సంతోషమని ఆయన అన్నారు. సర్వేలు ఆధారంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అభ్యర్థిని ఎంపిక చేశారని ఇదే విధానాన్ని 175 నియోజకవర్గాల్లో అనుచరిస్తే పార్టీకి, ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. బోస్ వి, నావి వ్యూహాలు ఒకేలా ఉంటాయని నీతి, నిజాయితీ గల విలువలు తో కూడిన రాజకీయాలు చేయడం వలన బోస్, నేను మంచి మిత్రులమయ్యామని అన్నారు. మేము ఇద్దరం వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నావాళ్ళమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాను పిల్లి సూర్య ప్రకాష్ కు మద్దతు గా ఎన్నికల ప్రచారం చేస్తానని, అగ్నికులక్షత్రియ కులస్తుల మద్దతు కోరుతానని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు అంతా పిల్లి సూర్య ప్రకాష్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పిల్లి సూర్య ప్రకాష్ ను సొంత కొడుకులా భావించి ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఏపీ మంత్రులు వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. కృష్ణంపాలెం హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ ను సంఘ సంస్కర్తగా మంత్రి వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి 2లక్షల 60 వేల కోట్ల రూపాయలు జమ చేశారని తెలిపారు. ఇక ఏపీలో వృద్ధి రేటు పెంచిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చారని పేర్కొన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేసిన నేత జగన్ మాత్రమే అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. దీని కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.





Total views : 78169