చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి, ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. అయితే.. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరుణం అసన్నమైoది. కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మికి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి అరటి గెలలు నేలమట్టమయ్యి.. దర్శనం ఇచ్చాయి. సంవత్సర కాలం పంటల సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు వరలక్ష్మి. 6 సంవత్సరాలుగా పంటలు చేస్తున్నామని.. కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో నష్ట పరిహారం అందినదని.. నాటిన మొలకలకు కూడా 30 వేల ఆర్థిక సహాయం అందినదని హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమ పరిస్థితి చూసి తమకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని.. సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
chittoor
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఫ్యాక్టరీ వద్దు..మా పొలాలు మాకే కావాలంటూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గోపిశెట్టిపల్లి రైతులు సుమారు 150 మంది ధర్నానిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచూ పేపర్లలో మా గోపిశెట్టి పల్లి గ్రామానికి చెందిన వందలాది ఎకరాల్లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, తమకు అధికారులు ఎవరు ఈ విషయమై అధికారికంగా ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ఎన్నో దశాబ్దాలుగా తాత ముత్తాతల నుండి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని. భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోమన్నారు..ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో రైతులు సిబ్బందికి వినతి పత్రం అందించారు.





Total views : 90731