తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య వర్సిటీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయగొదావరి జిల్లాల వైసీపీ యువజన అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ముందడగు వేస్తున్నామని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. 4 వేలకు పైగా కంపెనీలలో యువతకు ఉద్యోగా అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీలు అయిన మార్పులు, చేర్పులు, రాజకీయ సమీకరణాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ కూడా సీట్ల వ్యవహారం లో మార్పులు చేస్తున్నారని అన్నారు. 175 స్థానాల్లో 175 ఎమ్మెల్యే లను ఎన్నుకునేందుకు ప్రజలు మరోసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరింత జాగ్రత్తగా గెలుపు గుర్రాలను పెట్టాలని, అక్కడక్కడా చిన్న చిన్న సర్దుబాటులు చేసి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మాకు మెస్సేజ్ ఇస్తూ మార్పులు చేస్తున్నారని అన్నారు . రాజానగరం లో మళ్ళీ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యల కోసం నేను సీఎం కార్యాలయానికి వారానికి రెండు సార్లు వెళ్లానని, అభివృద్ధి చూసి ఎమ్ చేయలో తెలియక, ఎమ్మెల్యే మేము అంటూ కొంతమంది అసలు పెంచుకుంటున్నారని ఆ ఆశలు ఆడియాసలు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానంలో మొట్టమొదట గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాజానగరం మాత్రమే అని ఆశ పడుతున్న కొందరికి చెబుతున్నా అని సీట్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను, ఆపైనే ఉండే వాటికోసమే నేను ఆలోచిస్తానని ఆయన అన్నారు.
CM Jaganmohan reddy
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు మంత్రి విడదల రజినీకి ఇవ్వడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. వైసిపి అధిష్టానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దాలి గిరిని ప్రకటించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి మద్దాల గిరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కోరారు.
తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, జెడ్పీ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం వాకాడుకు ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను ఏ విధంగా బ్రష్టు పట్టించారనే విషయంపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే విద్యార్థి మేలుకో… భవిష్యత్ కాపాడుకో… కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి రాష్ట్రంలో సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అనేక కారణాలు చెప్పి సుమారు 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి దూరం చేశారన్నారు. ఇక ఇప్పటివరకు ఫీజు బకాయిలు చెల్లించలేదని పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. దేశం బాగుపడాలంటే విద్యార్థులతోనే సాధ్యమవుతుందని విద్యావ్యవస్థ బాగుండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని విద్యార్థులందరూ మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తి కావడంతో ఈ టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన వస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గాలేరు నగరి వరద కాలువ నిర్మాణంలో భాగంగా అవుకు రిజర్వాయర్ సమీపంలో రెండు టెన్నల్ ల నిర్మాణానికి అప్పటి వైయస్ ప్రభుత్వం 2008 లో శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కొక్కటి ఆరు కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను 436 కోట్లతో నిర్మించారని కాటసాని రామిరెడ్డి తెలిపారు. టన్నెల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.





Total views : 78395