రుద్రాక్షలు ధరించుట వలన దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును. రుగ్మతలు నియంత్రించడానికి , ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి , శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు , ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు. రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి. రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి.
cvr telugu
బీట్రూట్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో లెక్కించడం చాలా కష్టం. బీట్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. ముఖ్యంగా దీని రసం, సలాడ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. తరచుగా మలబద్ధకం, కడుపు సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా బీట్రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉంటే బీట్రూట్ సలాడ్ లేదా జ్యూస్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బీపీ అదుపులో ఉంటుంది. తరచుగా అలసట లేదా బలహీనత ఉంటే బీట్రూట్ దివ్యౌషధంగా చెప్పవచ్చు. బీట్రూట్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. బీట్రూట్ మన అందానికి చాలా ముఖ్యమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై అద్భుతమైన గ్లో తెస్తుంది.
కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి.కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి. ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారు. ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు.ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. తవ్వుతున్నప్పుడు ఠంగ్మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి. దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట. ఆ నోటా ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు. అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు. వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది. అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది. కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు. దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది. ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం.
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేకుండా ఎవరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే చాలామంది రాత్రిపూట స్మార్ట్ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చార్జింగ్ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి. లేదంటే ఫోన్ ఆయుష్షు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ఫోన్లలో అధిక ఛార్జింగ్ను నిరోధించే అదనపు రక్షణ చిప్లు ఉన్నాయి. ఈ చిప్స్ వల్ల బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ ఆగిపోతుంది. అయితే రాత్రిపూట ఫోన్ను ఛార్జింగ్లో ఉంచినట్లయితే బ్యాటరీ 99%కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫోన్ తొందరలోనే పాడవుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్లో ఉంచవద్దు. బదులుగా దానిని 80% నుంచి 90% వరకు ఛార్జ్ చేసి ఆపై దాన్ని అన్ప్లగ్ చేయాలి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఫోన్ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి. ఫోన్ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఫోన్ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ పెట్టవద్దు.
వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్ట – వెనిగార్తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి వడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు స్పూన్లు ఈ సిరప్ను మెంతికూర డికాక్షన్తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో గంట ముందే పోలింగ్ ముగించారు సిబ్బంది. క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ ముగిసిన నియోజకవర్గాల జాబితాలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also..
Read Also..
నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారమవుతామని, అది తమకు ఇష్టం లేదన్నారు. ఇక ఓటింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉందని, పట్టణ ప్రాంతంలో మరింత ఓటింగ్ శాతం పెరగాలని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఓటర్లు తనపట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ మరో గంటంలో పూర్తి కానుంది. అయితే చాలా చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 3 గంటల వరకు అత్యధికంగా మెదక్లో 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం మాత్రమే నమోదైంది. అన్ని జిల్లాల కంటే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో ఓటు వేసేందుకు నగర ఓటర్లు బయటకు రావాలని ఈసీ పిలుపునిచ్చింది.
చాలా పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు. నేరుగా వెళ్లి ఓటేసి వచ్చేంత ఖాళీగా ఉన్నాయి. నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, సర్కిళ్లలో ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించాయి. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ పోలింగ్ రోజున టూర్లకు వెళ్లకుండా ఓటు వేసేలా వారిని చైతన్యం చేసేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అయినా పరిస్థితి మారడం లేదు దీంతో హైదరాబాదీలు ప్లీజ్ బయటకు వచ్చి ఓటేయండి, ఓటు వేయటం కోసమే సెలవు ఇచ్చింది. ఎన్నికల అధికారులు ప్లీజ్ రండి ఓటేయండి అంటున్నారు.
పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లోని చర్ల మండలం అంజనీపురం దారిలో భద్రతా బలగాలు పోలీస్ జాగిలాలతో రూట్ మార్చ్ జరిపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును పోలీస్ జాగిలాలు పసిగట్టాయి. వెంటనే అప్రమత్తం అయిన బలగాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి దానిని నిర్వీర్యం చేయించారు. ఈ ఘటన అనంతరం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత చర్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న రాజకీయ నాయకులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ బయటికు పంపించారు. అనంతరం ఆయన అక్కడ భద్రతను పర్యవేక్షించారు.





Total views : 90526