అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి. గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు(60) అనే వ్యవసాయ కూలీ మృతి. అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు. గంట తర్వాత వెంకట రామారావు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి యాక్సిడెంట్ అయిందని ఇంటికి ఫోన్ చేసి తెలియపరిచిన విశ్వనాథరాజు. మృతుని బంధువులు వచ్చేసరికి శవాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పెట్టి చనిపోయినాడు అని తెలియజేసిన విశ్వనాథరాజు. విశ్వనాథరాజు చెప్పే మాటలకు సంబంధం లేదని ఒకసారి ముందుకు పడిపోయారని ఒకసారి వెనకకు పడిపోయాడని ఒకసారి ఆక్సిడెంట్ అయిందని చెప్పడం ఈ కేసు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. మృతుడికి ముగ్గురు మగ పిల్లలు భార్య ఉన్నారు. తరచుగా రాజుగారి దగ్గర పనికి వెళుతూ వస్తూ ఉంటారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పట్టను పోలీసులు.
cvr
రామగుండం సింగరేణి ఏరియా వన్ జీడికే లెవెన్ ఇంక్లైన్ బొగ్గు గనికి వెళ్లే పాత రహదారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం షిఫ్టులో కార్మికులు గని వద్ద నిరసన దిగారు .కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో గనికి చేరుకునే అవకాశం ఉన్న రహదారిని మూసివేయగా 11 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు.గతంలో ఫైవింక్లైన్ నుంచి ఉన్న రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తూ గని వద్ద బైటాయించారు.
నల్గొండ : నాగార్జునసాగర్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న హైటెన్షన్. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించని ఏపీ ప్రభుత్వం. ఏపీ వైపు భారీగా మోహరించిన ఏపీ పోలీసులు. సాగర్ నుంచి మాచర్ల వైపు వచ్చే వాహనాలు అడ్డుకుంటున్న ఏపి పోలీసులు. డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్న టీఎస్ పోలీసు బలగాలు. నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్న ఏపి అదికారులు. ఇప్పటికే గంటకు 500 క్యూసెక్కుల చొప్పున సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం. పట్టువీడని ఏపి ప్రభుత్వం. ఎన్నికల సమయం కాబట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న తెలంగాణ ప్రభుత్వం.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు. నెల్లూరు రూరల్, కోవూరు,రాపూరు, ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. వర్షాలతో స్తంభించిన జనజీవనం.. చిన్నపాటి వర్షాలకే నదులను తలపిస్తున్న రోడ్డులు. నెల్లూరు నగరంలోని అండర్ బ్రిడ్జిల అన్నింటిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇక్కట్లు.
నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు..
నల్గొండ జిల్లాలో పోలింగ్ 85.49% నమోదు. నల్లగొండ, నకిరేకల్,మునుగోడు, దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ. నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు :- 84.83 % పోలింగ్ జరిగింది సూర్యాపేట, హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు.. ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు :- భువనగిరి, ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదు. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది.
నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు. ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు. ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు. వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు. చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ.
రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా 567.94 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో టన్నెల్ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం రెండో టన్నెల్ను జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో గంట ముందే పోలింగ్ ముగించారు సిబ్బంది. క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ ముగిసిన నియోజకవర్గాల జాబితాలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also..
Read Also..
నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారమవుతామని, అది తమకు ఇష్టం లేదన్నారు. ఇక ఓటింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉందని, పట్టణ ప్రాంతంలో మరింత ఓటింగ్ శాతం పెరగాలని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఓటర్లు తనపట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.






Total views : 194813