పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్ పడవలు ఇప్పుడు పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ లో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు రైతులు వరి కోసి వరి పనలను పడవల ద్వారా వడ్డీకి చేరుస్తున్నారని పంట పొలాల నుండి నీరు బయటకు వెళ్లకపోవడానికి వైసీపీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యమని కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలు ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
cyclone michaung effect on ap
తిరుమలలో భారీ వర్షం భారీ ఈదురు గాలులు. భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం. పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో నుజ్జునుజ్జైన కారు. మూడు కారులు ధ్వంసం. సమయానికి కారులో భక్తులు ఎవ్వరు లేక పోవడంతో తప్పిన పెను ప్రమాదం. వెంటనే స్పందించిన టిటిడి ఫారెస్ట్,ఫైర్ సిబ్బంది. నేలకొరిగిన చెట్టును కట్ చేసి తోలగిస్తున్న సిబ్బంది..
కృష్ణ జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, మిగ్జాం తుఫాన్ ధాటికి అతలాకుతలమైన దివిసీమ. జలమయమైన రహదారులు. నదులు తలపిస్తున్న వరిపంట పొలాలు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రైతాంగం. మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దివిసీమ ప్రాంతం అయినా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఈదురు గాలులకు వరి సాగుభూములు నేలకు ఒరిగి జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతాంగం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రభావంతో రైతాంగం కుదేలయ్యారు..
Read Also…
Read Also…




Total views : 79309