జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు.
ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారామ్ మాట్లాడుతూ ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐ గారికి సమాచారం అందించామని పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు ఊరి పెద్దమనుషులు, పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.
devotional news
పూర్వం దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు. ఆహ్వానం ఉండకపోయినప్పటికీ శివుని సతి పార్వతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలింది. అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణ కోసం శివుడిని యథాస్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి. ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవి అలోపీ దేవిగా వ్యవహరిస్తారు. అలా పిలవడానికి ఓ కథ ప్రచారంలో వుంది. పూర్వం ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయం చేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. అప్పటి నుంచి ఆ దేవిని అలోపీ దేవి గా వ్యవహరిస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటి నుంచి అక్కడివారు పెళ్ళిళ్లకు ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.
Read Also..
Read Also..
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆలయంలో పురాతన రాతి మండపాలు ఏవి తొలగించలేదని, 1956 లో పోటుకు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న స్షోర్ రూమ్ సిమెంట్ కట్టడం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించి అక్కడ ఆశీర్వాద మండపముగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా పురాతన కట్టడాలు కూల్చివేసినట్టు మాట్లాడడం తగదు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపలికి ఫోన్లు తీసుకెళ్లి సెల్ఫీలు చిత్రీకరించుకోవడం తగదని దీనిపై సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని, అధికారుల వివరణ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుధీర్ రెడ్డి పై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితమే పోటు వద్ద ఉన్న స్టోర్ రూమ్ స్థానంలో ఆశీర్వాద మండపం చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించిందని తెలిపారు. తమ ధర్మకర్తల మండలి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి క్షేత్ర ప్రతిష్ట పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణలతో ఆలయ ప్రతిష్ట రాజకీయాల కోసం దెబ్బతీయొద్దని కోరారు. స్టోర్ రూమ్ సిమెంట్ కట్టడం తొలగింపులో విగ్రహాలు ఏమీ లేవని, ఆగమ విరుద్ధమైన పనులు ఏమీ చేయలేదని దీనిపై ప్రమాణం చేయడానికి బొజ్జల సుధీర్ రెడ్డి రావాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సవాల్ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామంలోని నీలకంటేశ్వర స్వామి ఆలయానికి మహా కుంభాభిషేకం తమ హయాంలోనే చేస్తున్నామని గుర్తు చేశారు. గత 40 ఏళ్లు గా నిరాధారణకు గురైన అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తున్నామని తెలిపారు. స్వామి వారి డిపాజిట్లు 236 కోట్లు ఉందని, వాస్తవాలు తెలుసుకొని సుధీర్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలు అత్యంత ఆవశ్యమని, దీనిపై మరో వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వహించనున్నట్లు తెలిపారు. రద్దీ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా శివయ్య గోపురం వద్ద 45 లక్షలతో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాహు కేతు పూజ మండపాలని ఆలయ ప్రాకారంలోకి తీసుకువచ్చి టైం స్లాట్ విధానం కూడా అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ ఆలయం లోపల ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. అనుభవం లేని కాంట్రాక్టర్లు దేవస్థానంలో పనులు చేయడం లేదని, ఊరందూరు నీలకంటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ఆలయ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవహరించాలని, మన ఆలయం మన క్షేత్రం ప్రతిష్ట కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుధీర్ రెడ్డి తెలుసుకోవాలని హితవు చెప్పారు. అదేవిధంగా మీ తండ్రి గారు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఏ ఒక్క రోజైనా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎన్ని దేవాలయాలు కట్టించారు అని చెప్పండి. మా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 116 శ్రీరామ మందిరం లూ రాష్ట్ర ప్రభుత్వం చే నిధులు మంజూరు చేశారు అది కూడా నిర్మాణాలు కూడా పూర్తి అయ్యింది తెలియజేసినారు. మీరు గాని మీ యొక్క నాయకులు ఏ రోజైనా విరాళాలని సమకూర్చి అభివృద్ధికి కృషి చేసారా.ఈ విలేకరుల సమావేశంలో ధర్మకర్త మండలి సభ్యురాలు సుమతి, ఆలయ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్,ఈఈ నూకరత్నం, డిప్యూటీ ఈఓ వెంకటసుబ్బయ్య, ధనపాల్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, వేద పండితుల అర్ధగిరి, మారుతి శర్మ, ప్రభాకర్ శర్మ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.