రావులపాలెం జాతీయ రహదారి డిగ్రీ కాలేజీ ఎదురుగా లారీ రిపేర్ కు రావడం తో లారీ నిలిచిపోగా దానిని డ్రైవర్, క్లీనర్ లారీ కింద ఉండి బాగు చేసుకుంటున్నారు. ఈలోగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్నా టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టడం తో లారీ కింద ఉండి బాగుచేసుకుంటున్న డ్రైవర్, క్లీనర్ లు పైకి లారీ దూసుకెళ్లడం తో ఆక్కడకక్కడే ఇద్దరు మృతి చెందారు. అలాగే టిప్పర్ లారీ కేబిన్ ఆగి ఉన్న లారీ వెనుక భాగం లో ఇరుక్కు పోవడం తో ఇందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు మధ్య లో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 అంబులెన్సు సిబ్బంది, హైవే రెస్క్యూ టీం అక్కడికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు.
driver
సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆర్టీసి బస్ లలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్ లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లోని అన్ని మండలాలలో ఆటో డ్రైవర్ లు సర్వీస్ లు బంద్ చేశారు. ఫ్రీ బస్ వద్దు ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టద్దు, స్త్రీ అంటే మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా కుటుంబం అని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదని, ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ ల కడుపు కొట్టవద్దని నినాదాలతో పాసింజర్ ఆటో డ్రైవర్ అండ్ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద నుండి వందలాది ఆటో లతో ఆర్.డి.ఓ. కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్.డి.ఓ. కార్యాలయాన్ని ముట్టడించారు. ఆటో డ్రైవర్ ల కుటుంబాలను రోడ్డున పడేసే ఫ్రీ బస్ సర్వీస్ సర్వీస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.





Total views : 80205