ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. ఎన్నో కలలతో వర్సిటీలోకి విద్యార్థులు అడుగు పెడతారని… భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో విద్యార్థులు తయారవుతారన్నారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. సమాజంలో మీవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారామె. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల ప్రాత ముఖ్యమైందని…. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
Tag: