గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఏ వాహనం ఎప్పుడు, ఎక్కడకు వెళ్తోంది.. ఎంత చెత్తను రవాణా చేస్తోంది.. ఏ ప్రాంతానికి వెళ్తోంది.. అనే విషయాలను గుర్తించడం కష్టంగా మారిందని.. అందుకు వెహికిల్ ట్రాకింగ్ సిస్టం తీసుకురావాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వెహికిల్ ట్రాకింగ్ సిస్టంను మొదటి దశలో మూడు జోన్లలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. దీనికోసం ప్రత్యేక సెంటర్, సిబ్బందిని కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో 2 వేల 666 తీవ్రమైన చెత్త ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలోనే అత్యధికంగా జీవీపీలు ఉన్నాయి. వీటిలోని చెత్తను తీసుకెళ్లడానికి 75 చెత్త కంప్రెస్సింగ్ వాహనాలు ఉన్నాయి. వెహికిల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆధారంగా వాటిని ట్రాకింగ్ చేయనున్నారు. తర్వాత శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్.బీ. నగర్ జోన్లకు సంబంధించిన వాహనాలతో పాటు రాంకీకి సంబంధించిన వాహనాలను సైతం ట్రాకింగ్ సిస్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
చెత్త రవాణా చేస్తున్న వాహనాల ట్రాకింగ్ ప్రక్రియ తర్వాత ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న ఆటో టిప్పర్లను సైతం ట్రాకింగ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4 వేల 500 ఆటో టిప్పర్లు ఉన్నాయి. వీటిపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటు ఆటో టిప్పర్లు, అటు చెత్త రవాణా వాహనాలను ట్రాకింగ్ లోకి తీసుకువస్తే చెత్త నిర్వహణ మెరుగ్గా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90596