అల్లూరి సీతారామరాజు జిల్లా, వైసీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంతో అరకులోయ లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు. ఎంపీ మాధవి బిసి కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని, ఎస్టి కాదని, ఎస్టీకి చెందిన స్థానికేతరుడు కు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు ర్యాలీ, మానవహారం.
health news
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
అరటి తో అందాన్ని మరింత పెంచుకోవచ్చని విషయాలు చాలా మందికి తెలియదు. దీనితో చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. శరీరంపై ముఖంపై మచ్చలు అనేవి లేకుండా చేసుకోవచ్చు. జిడ్డు చర్మానికి చెక్ పెట్టవచ్చు మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా మీ యొక్క చర్మం అద్భుతంగా అందంగా తయారవడమే కాకుండా మృదువుగా ముడతలు పడకుండా ఉంటుంది. అదేవిధంగా యుక్త వయసులో ఉండే ఎవరైనా సరే ఈ అరటిపండు గుజ్జుని ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలు లాంటివి రాకుండా చేసుకోవచ్చు. దీనిని తరచూ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మీ శరీరం ఆయిల్ ఫేస్ అయితే కనుక తప్పనిసరిగా దాన్నుంచి బయటపడవచ్చు. మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా అరటిపండుని గుజ్జుగా చేసి దానిలో ఒక అరటి స్పూన్ పసుపు వేసి వేప పువ్వుని కలిపి పేస్ట్ లా చేయడం ద్వారా దీనిని మోకానికి అప్లై చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా జిడ్డు చర్మం సమస్యతో బాధపడే వారు కూడా అరటిపండు ముక్కకు చిన్న దోసకాయ ముక్క కలిపి వీటిని పేస్టులా చేసుకుని దీనిని మొఖానికి పట్టించడం ద్వారా జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడవచ్చు. తరచూ ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోయి చర్మం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది. కాబట్టి వారానికి ఒక్కరోజు దీనిని ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.



Total views : 92154