అల్లూరి జిల్లా హుకుంపేట లో సాకలిగెడ్డ వద్ద కు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు. హుకుంపేట మండలం బారపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపలు వేటకు వచ్చారు .దురదృష్టవశాత్తు బోనంగి రవికుమార్ (32) గెడ్డలో చేపలు పడుతుండగా సాయంత్రం 4.30 సమయంలో ఊబిలోకూరుకుపోయి గల్లంతయ్యాడు. వారితోనే చేపలు వేటకు వచ్చిన వంజలి శంకర్, కిలో రామారావు, కీల్లో సంతోష్ , గెడ్డలో గల్లంతైన రవికుమార్ బయటకు రకపోయే సరికి స్థానిక పోలీసులకు సమాచారం వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి గల్లంతైన గిరిజనుడి ని గజ ఈత గళ్ళ సహాయంతో గాలిస్తున్నారు. హైవే నిర్మాణం లో భాగంగా వంతెన నిర్మాణం అవుతున్న క్రమంలో గెడ్డ మధ్యలో 3 గొట్టాలు వేసి తాత్కాలికంగా చిన్న వంతెన నిర్మించారు. తాత్కాలిక వంతెన వెయ్యడం వాళ్ళ ఇక్కడ గెడ్డలో నీరు నిల్వ వుండటం వల్ల ఊబి గా తయారైందని కొందరుబాధితులు ఆరోపిస్తున్నారు.
hukumpeta
అల్లూరి జిల్లాలో హుకుంపేట నూతనంగా నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణికులు వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. గోకవరం నుంచి విజయనగరం వరకు-న జాతీయ రహదారిని ఏర్పాటు చేసేందుకు నీరు చల్లేందుకు ఎలాంటి నిబంధనలు లేకపోవడం తో ప్రయాణికులు ఈ రోడ్డుపై ప్రయాణించే సమయంలో దుమ్ముతో పోరాడాల్సి వస్తోంది. ఏజెన్సీ లో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆదివాసీ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఎంపీటీసీ బాలక్రిష్ణ తెలిపారు. అయితే హైవే పనులు ప్రారంభించిన తర్వాత ప్రజలు స్వచ్చ మైన కలుషిత మైన గాలి పీల్చుకుని అనారోగ్యం పలువుతున్నారని వాపోయారు. హైవే పనుల్లో నిమగ్నమైన ప్రైవేట్ సంస్థ దుమ్మును పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పొడి వాతావరణం నెలకొనడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను నుంచి పర్యాటకులు అరకు అందాలను చూసేందుకు వచ్చి ధూళి, దుమ్మి తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ రహదారి ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలను చూస్తుంది. కోట్ల వ్యయంతో హైవే పనులు ప్రారంభమయ్యనపుడు నుంచి. “భారీ దుమ్ము నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మా వాహనాల కిటికీలు మూసి ఉంచాలని మేము ఒత్తిడి చేస్తున్నాము. గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దుమ్ము ధూళి రెట్లు పెరిగింది. అత్యవసరమైన పని లేకపోతే, ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతున్నాము అని ఆదివాసీ ప్రజలు వాపోతున్నారు. ప్రాజెక్టు కోసం వేల సంఖ్యలో చెట్లను నరికివేయడంతో ఆ ప్రాంతంలో పచ్చదనం బాగా తగ్గిపోయింది. సాయంత్రానికి కూలీలు పగలు పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే పరిస్థితి నెలకొంది. హుకుంపేట నుంచి డుంబ్రిగుడా వెళ్లంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎండిపోయిన నదీగర్భాలపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వాహనాలు లోహరహిత మార్గాన్ని దాటుతున్నప్పుడు భారీ దుమ్మును సృష్టిస్తుంది. హైవే మొదలు పెట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు వాటరింగ్ చేయలేదని ఇలా ఐతే రోడ్ నాణ్యత ఎం వుంటాదాని ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ రోడ్డు నుంచి ప్రయాణించిన పట్టించుకోకపోవడం బాధాకరమని ఎంపీటీసీ బాలక్రిష్ణ బాధపరిచారు. ఎప్పటికైనా రోడ్డు పైన దుమ్మి ధూళి లేకుండా వాటరింగ్ చెయ్యాలని లేకుంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఎంపీటీసీ హెచ్చరించరు.





Total views : 223693