Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Crime ఊబిలో కూరుకుపోయి వ్యక్తి గల్లంతు..

ఊబిలో కూరుకుపోయి వ్యక్తి గల్లంతు..

by Prakash
Person drowns in quicksand..

అల్లూరి జిల్లా హుకుంపేట లో సాకలిగెడ్డ వద్ద కు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు. హుకుంపేట మండలం బారపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపలు వేటకు వచ్చారు .దురదృష్టవశాత్తు బోనంగి రవికుమార్ (32) గెడ్డలో చేపలు పడుతుండగా సాయంత్రం 4.30 సమయంలో ఊబిలోకూరుకుపోయి గల్లంతయ్యాడు. వారితోనే చేపలు వేటకు వచ్చిన వంజలి శంకర్, కిలో రామారావు, కీల్లో సంతోష్ , గెడ్డలో గల్లంతైన రవికుమార్ బయటకు రకపోయే సరికి స్థానిక పోలీసులకు సమాచారం వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి గల్లంతైన గిరిజనుడి ని గజ ఈత గళ్ళ సహాయంతో గాలిస్తున్నారు. హైవే నిర్మాణం లో భాగంగా వంతెన నిర్మాణం అవుతున్న క్రమంలో గెడ్డ మధ్యలో 3 గొట్టాలు వేసి తాత్కాలికంగా చిన్న వంతెన నిర్మించారు. తాత్కాలిక వంతెన వెయ్యడం వాళ్ళ ఇక్కడ గెడ్డలో నీరు నిల్వ వుండటం వల్ల ఊబి గా తయారైందని కొందరుబాధితులు ఆరోపిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.