international news
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఎలక్షన్ కమిషనర్లు. గన్నవరం విమానాశ్రయంలో ఎలక్షన్ కమిషనర్లకు స్వాగతం పలికిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జేసీలు మరియు ఉన్నతాధికారులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ నోవాటాలకు బయలుదేరి వెళ్లిన ఎలక్షన్ కమిషనర్లు.
రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1 లక్షా 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసిన ఈ ఆల్ రౌండర్ విజయాన్ని అందుకున్నాడు. తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్కి 45వేల 993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ అల్ హసన్ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు. బంగ్లా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై రెండు సంవత్సరాలు కావస్తోంది. తొలుత ఉక్రెయిన్పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రష్యా తన దాడుల్ని మరింత పెంచింది. ఉక్రెయిన్ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు ఎగబడుతోంది. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు ఈ యుద్ధం ఇంకెంత కాలం సాగుతుంది? అసలు దీనికి ముగింపంటూ లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచ దేశాల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొందని ఆయన పేర్కొన్నాడు. ఉక్రెయిన్ దూకుడు పెంచి రష్యాపై ప్రతిదాడులు మొదలుపెట్టడం వల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ బలగాల్ని వెనక్కు రప్పిస్తే యుద్ధం సద్దుమణుగుతుందని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి మాట్లాడుతూ తప్పకుండా ఆ దేశం నాటోలో ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్కు భద్రతా హామీలు అవసరమని లేకపోతే చరిత్ర పునరావృతమవుతుందని స్టోల్టెన్బర్గ్ హెచ్చరించారు.
Read Also..
Read Also..
ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి.
శ్రీకాకుళం, ఆరోగ్య ప్రదాత, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద సామూహిక సూర్యనమస్కారముల కార్యక్రమం ఘనంగా జరిగింది. వందలాది మంది జిల్లాలో ఉన్న యోగా విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అరసవల్లి ఆలయ ప్రాంగణంలో అధికారులు, యోగా మాస్టర్లు ఆధ్వర్యంలో సూర్యనమస్కారములు నిర్వహించారు. 12 సెట్లగా విద్యార్ధినీ విద్యార్ధులు సూర్యనమస్కారములు చేశారు. ఒక్క సూర్యనమస్కారములే కాకుండా వివిధ రకముల యోగాసనాలను చేశారు. ఆర్ట్ ఫుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయుష్ శాఖ అధికారి అన్నారు. మకర సంక్రాంతి పండగను పురష్కరించుకొని సూర్యనమస్కారముల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యోగా విద్యార్ధులు పాల్గొన్నారు. మొత్తం 5 సెషన్స్ గా నిర్వహించడం జరిగిందన్నారు.
అన్నమయ్య జిల్లా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నియోజకవర్గంలోని 98 సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే. 186 రోజుల్లో పూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తైన సందర్భంగా సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిపల్లి సచివాలయం కాంప్లెక్స్ లో శిలాఫలకం ఆవిష్కరణ. కెక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. పాల్గొన్న రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు. విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తేలిపిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వేళ్ళగలిగాం. ప్రతి ఒక్కరూ అదరించారు. తమతమ స్తోమతకు తగ్గట్లు స్వాగతాలు పలకడం, అల్పాహారాలు అందించారు. ఎమ్మెల్యే గా 15 ఏళ్లు ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగా. రెండున్నర సంవత్సరం కరోనా లేకుంటే మరింత ఆభివృద్ది జరిగేది. మళ్లీ ప్రజలు అదరిస్తారన్న నమ్మకం ఉంది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ గెలుపు సునాయాసంగా గెలిచింది. గోపాల్గంజ్-3 నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసీనా ఎనిమిదవసారి విజయం సాధించారు. 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో హసీనాకు 2లక్షల 49 వేల 965 ఓట్లు పడగా తన సమీప అభ్యర్థి, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాం ఉద్దీన్ లష్కర్కి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి.
తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న బేడాలను పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. ఈ విషయమై కార్యాలయ సూపరిండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు అక్కడే ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు కొంతకాలంగా పనిచేయకపోవడం లేదని చెప్పారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డేటా తో పాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లు కూడా చోరీ చేసారు అని వెల్లడించారు. వెంటనే క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Total views : 92037