విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామములో శ్రీ సీతారామచంద్రస్వాముల హనుమంతుల విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం, ప్రతిష్ట మహోత్సవం కన్నులపండుగా జరిగింది. ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట కన్నులపండుగగా జరిగింది. గ్రామము లో ఉన్న అడపడుచులతో గ్రామములో పండుగ వాతావరణం ఏర్పడింది. ఎలక్షన్ దగ్గరలో ఉండటంతో అభ్యర్థులందరూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ అభ్యర్థి లక్కేపోగు వందన కుమార్ మాట్లాడుతూ గ్రామములో ఉన్న ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆలయ ప్రదక్షణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు దారా మారేశ్వరావు ,కుక్కడపు కృష్ణార్జునరావు,పిల్లివట్ల వెంకటేశ్వరరావు,వనమా మాధవరావు, గంట వెంకటాచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Jai Sriram
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి, మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ ఉత్సవ మూర్తిని, శ్రీరామ అక్షింతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు, ప్రముఖులు పాల్గొని కోలాటాలతో ఆడి పాడి అలరించారు.
జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఊరేగింపుగా తరలి వెళ్లారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ ఉత్సవమూర్తిని తీసుకెళ్తున్న పల్లకిని భుజాలపై ఎత్తుకున్నారు. వచ్చే ఏడాది 2024 జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు, అయోధ్య రామ మందిర చిత్రం, ఆహ్వాన పత్రం వితరణ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.





Total views : 75479