పల్నాడు జిల్లా, దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది. వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం. అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
janga krishna murthy
తన మాటను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా ఒక రైతు సమస్యను పరిష్కరించాలని, రెవిన్యూ అధికారులను చెప్పినా పట్టించుకోక పోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే మాట వింటూ.. ఎమ్మెల్సీ జంగా.. పనులు చేయమని అధికారులను ఆదేశించినా కూడా పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్వయంగా చెప్పినా అధికారులు పనిచేయడం లేదంటే.. ఇక సామాన్య ప్రజల మాటేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పల్నాడు జిల్లా, గురజాల వైసీపీలో అసమ్మతి సెగ, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా మాచవరం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాట్ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న, శాసనమండలి విప్పుగా పదవి వస్తే అభినందన సభకు కూడా జనాన్ని రానీయకుండా అడ్డుకున్నారు. ఇంకా ఎన్నాళ్లు మీ అరాచకాలు, నియోజకవర్గంలో నా అభిమానులకు ఏ ఆఫీసులకు వెళ్లిన పని చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఎవరు జండా పట్టని టైంలో వైసీపీ జెండాను భుజాన వేసుకొని మోసాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావటానికి కృషి చేశాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతుంటే గురజాలలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మండలానికి ఇద్దరు ముగ్గురు మాత్రమే పెత్తనం చెలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వం ఎమ్మెల్సీ జంగా పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.