జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హాయంలో నిర్మించి.. ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. నూతన ఆసుపత్రిని ప్రారంభించి సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంపై సంబంధిత శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కిటికీలను ధ్వంసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మంత్రి దృష్టికి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి సంబంధిత శాఖ అధికారులను పిలిపించుకుని వంద పడకల ఆసుపత్రి లో కలియతిరిగారు.. ఆసుపత్రి భవన నిర్మాణ నాణ్యత ప్రమాణాల విషయం పై చీఫ్ ఇంజనీర్ ను అడిగారు.. ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సూపర్డెంట్ వంద పడకల ఆసుపత్రి విషయంపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుందని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jogulamba Gadwala District News
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఓల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్కు గురైంది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపుగా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసే లోపే సర్క్యూట్తో బస్సు మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు ప్రయత్నాలలో ఓ మహిళ ప్రయాణికురాలు అందులోనే చిక్కుకొని సజీవ దహనం అయ్యింది. మరో 12 మంది గాయాలపాలు అయ్యారు. పెట్రోలింగ్ సిబ్బంది, సమీపంలో ఉన్న మరికొంత మంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.






Total views : 79642