ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మైనారిటీలు నారా చంద్రబాబు నాయుడు అధికారం లోని రావాలని తేదేపా హయంలో లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, రక్షణ గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు కనేకల్లో ఏ ఇంటికి వెళ్లిన ప్రజాసారణ లభిస్తాందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిత్యవసర సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పెట్రోల్, డీజిల్ ధరలు 9 సార్లు పెరగడంతోపాటు చివరకు విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని మండిపడ్డారు. తెదేపా హాయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో కనేకల్లు రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండే విధంగా చెరువులకు నీరు అందించామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి నీటి వాటా రైతులకు సరిపడే విధంగా అందించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50000 మెజారిటీ కి తగ్గకుండా విజయం సాధిస్తామని దిమా వ్యక్తం చేశారు.
kalava Srinivasulu
చంద్రబాబు నాయుడుకు తేదేపా పార్టీకి ప్రజల నుంచి విశేషమైన, ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం లో వందలాది కుటుంబాలు తేదేపా లో చేరడం శుభపరిణామం అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నివాసం లి ఆయుత పల్లికి చెందిన 29 కుటుంబాలు, పైతోట గ్రామంలోనీ 40కుటుంబాలు తేదేపా పార్టీ లో చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తేదేపా పార్టీ లో చేరిన వారందరూ తాను రాయదుర్గం లో ఎమ్మెల్యే కావాలని, ఇప్పుడు ఉన్న సమస్యలు తీరాలని, ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆయన తో ఆవేదన చెందినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ సరిగా ఇవ్వడం లేదని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని రాయదుర్గం లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఏపీలో బీసీ కులగణనపై రాజకీయం వేడెక్కింది. సీఎం జగన్ రాజకీయ కుట్రలో బీసీ కులగణన ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని, రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ ను నమ్మి ఈ కుట్రకు బలికావొద్దని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పుకునే జగన్, ఇన్నాళ్లు కుల గణన అంశంలో కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కుల గణన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ కనీసం తన ఎంపీలకు కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడకుండా, ఎవరినీ ప్రశ్నించకుండా, ఉన్నట్టుండి కుల గణనను తెరపైకి తీసుకురావడం జగన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం అని అన్నారు. కుల గణన చేపట్టాలని చంద్రబాబు 2014లోనే కోరారని, కానీ కేంద్రం స్పందించలేదని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
Read Also..
Read Also..
అనంతపురం జిల్లా… రాయదుర్గం నియోజకవర్గం… రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ యంత్రాంగంతో తో నిర్వహించడం పై మండి పడ్డ మంత్రి కాలవ శ్రీనివాసులు. డి హిరేహాల్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో మా కొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి కాలవకు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. సచివాలయాన్ని సందర్శించి కొత్త పింఛన్ల నిర్లక్ష్యంపై అధికారులతో సమీక్షించారు. సచివాలయం ఎదుట తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి కాల్వ బయటాయించి మాకొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దాదాపు ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బుక్లెట్ లు ముద్రించి జగనే మళ్లీ రావాలి అనే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, ఎంపీడీవోలు, కలెక్టర్లను మొదలుకొని, అందర్నీ దీనిలో భాగస్వామ్యం చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో వైసిపి పార్టీ పిచ్చి ప్రచారాం పై టిడిపి పార్టీ, రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని విమర్శించారు. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి గానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదని బదులిచ్చారు. జగన్ ఎందుకు రావాలంటూ రాయలసీమ భవిష్యత్తు ఎడారి అవుతున్నందుకా, మద్యం నిషేధం దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ రెడ్డి మద్యం రేట్లు పెంచాడనినా, మద్యం విక్రయాలు పెంచాడనినా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు. తప్ప నియంత్రణ ఎక్కడ జరిగిందని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
Read Also..