నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాజకీయంగా కేసీఆర్ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని, బీఆర్ఎస్ను ఓడించడం ఎవరి తరం కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువత ఉందన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే అని అన్నారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు. కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు.
Kcr
నిర్మల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు. ధరణి పోర్టల్ ఉండాలా? వద్దా? అన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఏపార్టీ గెలిస్తే లాభమో ఆలోచించాలన్నారు. ప్రతీ పార్టీ చరిత్ర చూడాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్ని.. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? అన్నారు. నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 నుంచి 80 వేలు దాటాలన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. దళిత బంధు పుట్టించింది కేసీఆర్ అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రైతు బంధు కూడా అందించామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి, గద్దెగూడెం, అడవి అజిలాపూర్, కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది. కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు, వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్, బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ నెల 6 న దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…
ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మరిచిపోలేను. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది…టీఆర్ఎస్ పేరిట తప్పుడు రాజీనామా చేశారు. ఇది కూచుకుళ్లకు తగునా. ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యే పదవి కొట్లాడి రాజీనామా ఆమోదించుకున్నా. నాగర్ కర్నూల్ పై రాజేష్ రెడ్డికి జీరో నాలెడ్జి పోటీ ఎలా చేస్తాడు. రేవంత్ ఫేక్ సర్వేతో…పాపులారిటీలో నేను నెంబర్ 10 అన్నారు. ప్రజలను మోసం చేసే కూచుకుళ్ల నాగర్కర్నూల్ కు అవసరమా. సీఎం కేసీఆర్…రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయంలో తలమానికంగా మారింది. సీఎం కేసీఆర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న శ్రేణులూ కలిసిపోయేలా కృషి చేస్తా.
ఎన్నికల వేళ మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండు సార్లు తెలంగాణకు రాబోతుండటం ఆసక్తిగా మారింది. గత నెలలో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరుతామని గతంలో సీఎం కేసీఆర్ మా వెంట పడ్డారని, కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తానని మీరు ఆశీర్వాదించాలని కోరినట్లు మోడీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఎన్నికల వేళ ఈసారి పర్యటనలో మోడీ మరోసారి కేసీఆర్ను ఎటాక్ చేస్తారా లేక హామీల వరకే పరిమితం అవుతారా అనేది ఆసక్తిగా మారింది.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.
హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది సందర్భంగా ఎమ్మెల్యే ఖాదర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ నమోదు చేస్తుందని వారు తెలిపారు మరోసారి అంబర్పేట్ లో గులాబీ జెండా ఎగరవేస్తామని కాలేరు వెంకటేష్ దిమా వ్యక్తం చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమయింది. 200 మంది వైదికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు. ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది.
కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్.. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు.





Total views : 89991