Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

by Satya
KCR

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమయింది. 200 మంది వైదికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు. ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది.

Advertisements

You may also like

Our Visitor

019151
Total views : 90007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.