తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటీ, గంటా మురళి తదితరులు విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టిడిపి బృందం పరిశీలించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను పరామర్శించడానికి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా రాలేదని మండిపడ్డారు. పంట కాలువలో పూడిక తీయక పోవడం వల్ల కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నష్టం తీవ్రంగా ఉందని అన్నారు.. పండిన పంట చేతికి వచ్చే సమయం లో వచ్చిన ఈ కష్టాన్ని ప్రభుత్వ భరించాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా ప్రభుత్వం కొనాలి, అలా కొనని పక్షంలో మార్చి తర్వాత ఏర్పడే టిడిపి జనసేన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కేవలం ఏసీ రూములకే మాత్రమే పరిమితం అయ్యారని విమర్శించారు.. వైయస్సార్సీపి పార్టీకి టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం పై ఉన్న శ్రద్ధ రైతుల పంట పొలాలు పరిశీలించడంలో లేదని మండిపడ్డారు.. రైతులకు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు.
latest news
తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క. రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి. డిసెంబర్ 28వ తేదిన కాంగ్రేస్ పార్టి ఆవిర్బవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం. రైతు భరోసా అమలు చెయ్యడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తాం.
తిరుమల, శ్రీవారి సేవలో ఏపి మంత్రి గుడివాడ అమర్నాథ్. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్నా. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని ప్రార్ధించా. తుఫాన్ కారణంగా దేవుడి దయ వల్ల ఎక్కడా ప్రాణహాని జరగలేదు. పంట నష్టం జరిగిన ప్రదేశాల్లో స్వయంగా సీఎం పరిశీలించి, రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్ట పరిహారం చేల్లించారు. ఈ నెల 15వ తారీఖున క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు అనుకూలంగా, రాష్ట్రంకు మెలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం. జనవరి 1వ తారీకు నుండి పింఛను దారులందరికి 3 వేల రూపాయలు అందజేయనున్నాం. 15వ తారీఖు నుండి ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంకు నాంది పలకనున్నాం. వైసీపి ఇచ్చిన ఘన విజయం గతంలో ఎన్నడూ ప్రజలు వేరే పార్టీకి ఇవ్వలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినప్పటి నుండి సీఎం అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోక పోయే ఎమ్మెల్యేలను ప్రక్కన పెడుతాంమని సీఎం చెప్పారు. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో పార్టి నుండి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాం. ఒకరు భాధ పడ్డారనో, ఒకరి గురించి లక్షమందిని భాధ పెట్టే పని సీఎం ఎప్పుడూ చేయరు. పార్టీ ఫిరాయింపులు టీ కప్పుల్లో తుఫాను లాంటి మాత్రమే, మళ్ళి సద్దుకుంటాయ్. జగన్ ను సీఎం చేసేందుకు, రాష్ట్ర ప్రజలందరికి మంచి చేసేందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ ధర్నాచౌక్ వద్ద సమాన పనికి సమనవేతనo ఇవ్వాలి. ఉద్యోగాలు పెర్మిమినెంట్ చేయాలి. మీ పాలనలోదలరివ్యవస్థ ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ కార్మికులహల్త్ రిస్క్ ఆన్లైన్లో చేల్లించాలి. జీఓ30నిసవరించికార్మిక శాఖ రికమండషన్ అమలు చేయాలి. విలీన గ్రామాల కరోన వరదలు కొత్తగా తీసుకొన మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి. ఈనెల21న కేబినెట్ మీటింగ్ లో ప్రకటించాలి లేని పక్షంలో మా కార్యచరణ ఉదృతం చేస్తాం అని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం. అవనిగడ్డ కేంద్రం గా నిరుద్యోగులు, తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో(ఉపాధ్యాయులు ఉద్యోగాలు) భారీ గా నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి,డిఎస్పీ పోస్ట్ భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు పూర్తిగా మద్దతు పలికిన, ప్రతిపక్ష పార్టీ,టిడిపి జనసేన. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ధర్నా లు ,రాస్తారోకో అనుమతులు లేవుంటూ ఆంక్షలు విధించిన పోలీసులు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులు. ధర్నా వద్దకు భారీ గా పోలీసు యంత్రాంగం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు. ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు. భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై మాట్లాడంపై సమావేశం అవుతున్న ఆర్యవైశ్యులు. సమావేశంపై ఉత్కంఠ. మద్దాలగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆర్యవైశ్యులు..
పార్వతీపురం మన్యం జిల్లా, ఎర్రా కృష్ణమూర్తి కాలనీ, సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం. మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ. వై.కె.యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు. 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు. తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం. హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు. ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు.






Total views : 200828