మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతను పెంచామన్నారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్, జూటూరు కాలనిలోని అంగన్వాడీ సెంటర్, చుక్కలూరులోని అంగన్వాడీ సెంటర్, జెడ్పీ హై స్కూల్ తదితర చోట్ల ఆహారాన్ని తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి స్కూల్ లలో పేదవారు ఎక్కువగా విద్యను అభ్యసించడానికి వస్తారని విజయ ప్రతాపరెడ్డి తెలిపారు. వారికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం వల్ల… పుష్టిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి… నాణ్యత లేకపోతే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. పౌష్టికాహారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందజేస్తున్నాయని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా ఉండడానికి ఏజెన్సీలకు ప్రభుత్వమే కమిషన్ పెంచిందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92567