సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య స్కూల్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు రియాక్టయ్యారు. ఇంతకు ముందే ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు రెండో సారి షోకాజ్ నోటీసులు చేశారు. తీరు మార్చుకోకుంటే స్కూల్ సీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ చైతన్యకు అనుమతులు లేనప్పుడు ఇన్ని రోజులు అధికారులు ఏం చేశారని తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య పేరుతో, విద్యార్థుల తల్లి దండ్రుల దగ్గర కట్టించుకున్న అధిక ఫీజులు తిరిగి ఇస్తారా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం అంటు అధిక ఫీజులు వసూళ్లు చేయడంపై మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫామ్స్ డబ్బులు కూడా స్కూల్ లోనే విక్రయించారని ఆరోపిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ …విద్యాశాఖ అధికారులకు కనిపించక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేసిందని విమర్శించారు. ఇక స్కూల్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా.. అసలు బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఉపాధ్యాలు నిజంగానే ఉన్నారా.. లేక సర్టిఫికెట్లకే పరిమితమయ్యారని అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి