సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య స్కూల్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు రియాక్టయ్యారు. ఇంతకు ముందే ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు రెండో సారి షోకాజ్ నోటీసులు చేశారు. తీరు మార్చుకోకుంటే స్కూల్ సీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ చైతన్యకు అనుమతులు లేనప్పుడు ఇన్ని రోజులు అధికారులు ఏం చేశారని తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య పేరుతో, విద్యార్థుల తల్లి దండ్రుల దగ్గర కట్టించుకున్న అధిక ఫీజులు తిరిగి ఇస్తారా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం అంటు అధిక ఫీజులు వసూళ్లు చేయడంపై మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫామ్స్ డబ్బులు కూడా స్కూల్ లోనే విక్రయించారని ఆరోపిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ …విద్యాశాఖ అధికారులకు కనిపించక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేసిందని విమర్శించారు. ఇక స్కూల్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా.. అసలు బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఉపాధ్యాలు నిజంగానే ఉన్నారా.. లేక సర్టిఫికెట్లకే పరిమితమయ్యారని అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
- జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..జీటీ తమ సీజన్ను కొనసాగించేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయంగా నిలిచింది, ఎందుకంటే జీటీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్లో వరుసగా…
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62084