సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య స్కూల్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు రియాక్టయ్యారు. ఇంతకు ముందే ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు రెండో సారి షోకాజ్ నోటీసులు చేశారు. తీరు మార్చుకోకుంటే స్కూల్ సీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ చైతన్యకు అనుమతులు లేనప్పుడు ఇన్ని రోజులు అధికారులు ఏం చేశారని తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య పేరుతో, విద్యార్థుల తల్లి దండ్రుల దగ్గర కట్టించుకున్న అధిక ఫీజులు తిరిగి ఇస్తారా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం అంటు అధిక ఫీజులు వసూళ్లు చేయడంపై మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫామ్స్ డబ్బులు కూడా స్కూల్ లోనే విక్రయించారని ఆరోపిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ …విద్యాశాఖ అధికారులకు కనిపించక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేసిందని విమర్శించారు. ఇక స్కూల్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా.. అసలు బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఉపాధ్యాలు నిజంగానే ఉన్నారా.. లేక సర్టిఫికెట్లకే పరిమితమయ్యారని అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 62256