మడకశిర పట్టణం చీపులేటి 07.03.2024 వ తేదీ జరగబోవు శంఖారావ సభను దిగ్విజయం చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ… వచ్చే 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా మడకశిరలో దిగ్విజయంగా ఎగురవేయాలని ఉద్దేశంతో వర్గ విభేదాలు వీడి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అతి పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు.
Tag:




Total views : 141577