42
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ హాజరుకానున్నారు. 70 కోట్ల రూపాయలతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని పిప్పిరి సభలో సీఎం రేవంత్ మాటిచ్చారని అన్నట్టుగానే… నిధులు విడుదల చేశారన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు డిప్యూటీ సీఎం.





Total views : 141375