నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కారు గుర్తు ప్రచారం స్పీడ్ పెంచింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి నేడు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయస్వామి గుడి లేని ఊరు తెలంగాణ పల్లెలో లేదు అలాగే కెసిఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు కూడా ఈ తెలంగాణ పల్లెలో లేదు అంటూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారంలో ప్రసంగించారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని మర్రి అన్నారు. ఇదిలా ఉంటే మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి మర్రి జమున రాణి బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఓటర్లను ఆమె కోరారు. మూడోసారి మరి జనార్దన్ రెడ్డి గెలవడం, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు.
Marri janathanreddy
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మరి జనార్దన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని అందుకే ప్రజల తరఫునుంచి కారు గుర్తుకే ఓటేస్తామని తనను మూడోసారి గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బ్యాలెట్ లో మూడో నెంబర్ గుర్తుపై నొక్కి తనను గెలిపించాలని బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తన ప్రచారంలో ప్రజలు ఇస్తున్న మద్దతుకు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అచ్చంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ పై జరిగిన దాడి ని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి పిరికి చర్య అని మండిపడ్డారు. ప్రచారం నిర్వహించి తిరిగి వెళుతున్న క్రమంలో ఇలాంటి ఆటవిక చెరగకు పాల్పడడం కాంగ్రెస్ నేతలకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతో ఇలాంటి పిరికి చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న ఆధార అభిమానులను చూసి ఓర్వలేకపోతున్నారని, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇన్నాళ్లు మాకు కలిగిందని ఇకపై కూడా ప్రజలు మమ్ములను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని మా పార్టీ సేవలే మాకు శ్రీరామరక్షగా ఉంటాయని అన్నారు. దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం చేదోడువాదోడుగా ఉంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటున్న నాయకులు కాంగ్రెస్ లో చేరికతో ఎమ్మెల్యే షాక్ లో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురులేదనుకొని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తన అనుచరుల్లో ఇలాంటి అయోమయం ఉందో తేరుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే మర్రి ఉన్నారు. నిన్నటి వరకు ఎదురులేద్దనుకొని ధీమాగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డికి తన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. గెలుపు ధీమాలో ఉన్న మర్రికి పరిస్థితి పట్టడం లేదు. బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.





Total views : 75285