Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Latest News నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ..

నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ..

by Rama
BRS leaders join to Congress

నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం చేదోడువాదోడుగా ఉంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటున్న నాయకులు కాంగ్రెస్ లో చేరికతో ఎమ్మెల్యే షాక్ లో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురులేదనుకొని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తన అనుచరుల్లో ఇలాంటి అయోమయం ఉందో తేరుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే మర్రి ఉన్నారు. నిన్నటి వరకు ఎదురులేద్దనుకొని ధీమాగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డికి తన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. గెలుపు ధీమాలో ఉన్న మర్రికి పరిస్థితి పట్టడం లేదు. బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Our Visitor

012573
Total views : 75443

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.