కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ కొత్త అభ్యర్థి పై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ కౌన్సిలర్ ల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి కానీ తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. కానీ పార్టీ లో ఎక్కడ తిరగని మాచని వెంకటేష్ ను ప్రకటించడం సరికాదని, తనకు ఏ మాత్రం తాము మద్దతు ఇవ్వము అన్నారు. కాబట్టి ఈ మాచని వెంకటేష్ నిర్ణయం పై అధిష్టానం మరోసారి పునరాలోచించాలని వారు కోరారు. లేని పక్షంలో నియోజకవర్గంలోని నాయకులు అంత కలిసి అధిష్టానం దగ్గరకు వెళ్లి కూర్చుంటామని తెలిపారు.
Tag:
MLA Errakota Chennakesava Reddy
ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.




Total views : 78866