ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.
సొంత ఇంటి కలను నెరవేర్చిన జగన్…
927
previous post