ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి, 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.
narendra modi
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశానికి ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటుండగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గుణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ తో మధ్యప్రదేశ్ లో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ 20వేల కోట్ల నుంచి 80వేల కోట్లకు పెరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీఎం ఉజ్వల, ఆవాస్ యోజన, మాతృవందన యోజన, లాడ్లీ బ్రాహ్మణ యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ఎన్నో పథకాలను మహిళల కోసమే ప్రవేశ పెట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పార్టీకి నారీ శక్తి నుంచి ఆశీస్సులు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also..
Read Also..
ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు. మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది. తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్.. సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ ప్రచారానికి రానున్నారు. ఈ మేరకు ముఖ్యనేతల పేర్లను భాజపా వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలూ ఉన్నారు.క్యాంపెయినర్ జాబితాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యడియూరప్ప. ఇదిలాఉండగా ప్రచారం కమిటీలో ఉన్న విజయశాంతి కి కమిటీలో చోటు దక్కలేదు. కనీసం విజయశాంతితో మాట్లాడేందుకు కూడా బీజేపీ నేతలు యత్నించలేదు.
రానున్న 25 ఏళ్లు భారత్కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం గుజరాత్లోని కేవడియాలో పటేల్ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను చూడలేరు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారికి అండగా నిలబడేందుకూ వెనకాడరు. కొంతమంది రాజకీయ నేతలకు సానుకూల అంశాలు కనిపించవు. వారు దేశ ఐక్యత కంటే సొంత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు అని విపక్షపార్టీలపై మోదీ మండిపడ్డారు. అలాగే త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అలాంటి నేతలు దేశాన్ని విభజించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటారని దుయ్యబట్టారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అందుకోసం పటేల్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ. కశ్మీర్, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్ను నిర్వహించారు. సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా వారి ధైర్యసాహసాలను మోదీ అభినందించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అద్భుతం.. జియో స్పేస్ ఫైబర్ను పరిశీలించిన మోదీ
తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్లో ఆకాష్ అంబానీ జియో స్పేస్ ఫైబర్పై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ జియో స్పేస్ ఫైబర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. జియోతో టెలికం రంగంలో అద్భుతాన్ని సృష్టించిన రియలన్స్ ఇప్పుడు జియో స్పేస్ ఫైబర్ పేరుతో మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ విషయమై జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ. ‘జియో స్పేస్ ఫైబర్తో దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుంది. గిగాబిట్ యాక్సెస్తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో భాగమవుతారు. దేశంలోని చాలా మంది తొలిసారి ఇంటర్నెట్ సేవలను పొందనున్నారు’ అని చెప్పుకొచ్చారు. దీనికోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో పనిచేస్తుంది.
Read also..
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు. నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు.