ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి. కానీ నిన్న చనిపోయిన సీతారాం ఏచూరి నమ్మకాన్ని ఒక నిలువెత్తు నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు.
విప్లవమా! అది వస్తుందో రాదో తెలియని దశలో సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో ఏచూరి కామ్రేడ్ గా మారారు పైన స్వర్గం ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి “పొద్దు తిరుగుడు పూలు” కూడా సిగ్గుపడి తల దించుకున్నాయి.
కళ్ళ ముందే బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా, చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు పక్క చూపులు చూడలేదు.
చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం. కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు. ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు. అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల. ఆది దాదాపు అసాధ్యమయిన పని. అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీ లో ఒక ప్రొఫెస్సర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు.
కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త (ideologue), ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీ లో క్రీమీ లేయర్ గా, ఒక ఎలీట్ గా మిగిలిపోయారు. అందువల్ల తన టిపికల్ ఫార్మ్, ఆంగ్లిసైజెడ్ కంటెంట్ లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది.
జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు. అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా, వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది. అలాగే 20 వ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు. బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు.
మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి పెద్ద సవాల్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90590