శ్రీకాకుళం జిల్లా, జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం. సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల, కెవిపి.రామచంద్రరావు, సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి, మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. ఉదయం శ్రీకాకుళం నుండి బయలుదేరి ఇచ్ఛాపురం లోని వైయస్సార్ పైలాన్ ను సందర్శించనున్న షర్మిల. అనంతరం ఇచ్ఛాపురంలోని R.J. ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గo.ల నుండి 12: 30గo. లు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తో సమీక్ష సమావేశం..అనంతరం విజయనగరం పయనం కానున్న షర్మిల.
news
విజయవాడ, అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సమ్మె విరమిస్తున్నాం, రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం. జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపు చేస్తాం అన్నారు. సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది అని వెల్లడించారు.
విజయవాడ, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం. జూలై లో జీతాలు పెంచుతాం. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కెనాల్ రోడ్ లో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మవారి ఊరేగింపులో తలెత్తిన వివాదంలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు కారం చల్లి దాడి చెయ్యడంతో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు ఇరువర్గాలను చేదరగొట్టడం తో వివాదం సద్దుమణిగింది.
అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.
ఖమ్మం జిల్లా, వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది . స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న స్వస్థలం మధిర మండలం మర్లపాడు.
విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం( నేటి ) మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలసి వి ద సం అధ్యక్షుడు బూసి వెంకటరమణ జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయటకు వచ్చి ఫ్ల కార్డులతో నినాదాలు చేసారు. ఈ సంధర్భంగా బూసి వెంకటరమణ మట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఉదయం నుంచి దీక్షలో ఉన్నాడని జైలు అధికారులు ఈ సాయంత్రానికి గాని అనుమతి ఇవ్వలేమని చెప్పారని అన్నారు. అయినా శ్రీనివాస్ దీక్ష ప్రారంభించారన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉందని, కోడి కత్తి కేసులో బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్.ఐ.ఏ స్పష్టం చేసినా ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలా చేసి బయటకు రానివ్వకుండా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ బయటకు వస్తే జగన్ కు ఎన్నికల ముందు చిక్కులు తప్పవనే ఆపుతున్నారని, ఎస్సీలపై కోర్టులో ఉన్న 19 కేసులను ఇటీవల ఎత్తివేశారని శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదారత చూపించలేకపోతున్నారని అన్నారు. దళితుల పట్ల కపటి ప్రేమ చుపిస్తున్నావని జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23వ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయ స్థూపం వద్ద వైయస్సార్ కు నివాళులర్పిస్తారన్నారు. అనంతరం ఆర్జె ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారని తెలిపారు. అక్కడ నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరుతారని ఆయన తెలిపారు. వైయస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైయస్సార్ పాదయాత్ర విజయ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విజయ స్థూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జె ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
రామ జన్మభూమి అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని, టిటిడి చైర్మన్ గా ఉన్న కారణంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తరతరాలుగా కోరికగా మిగిలిన ఒక కల సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే దివి నుంచి దిగి వచ్చినట్లు గా..మనలో మానవతా విలువలను పెంచి ప్రపంచాన్ని మార్చి మరళా రామ రాజ్యం తీసుకురావటానికి ఓ గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్లు, ప్రపంచంలో హిందువులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ గొప్ప సందేశం ఇచ్చినట్టు ఉందని,బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం మాటలలో చెప్పలేనిదని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అయోధ్యపురి శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగుతూ భక్తులంతా తన్మయంతో పూలలాడుతున్నారు. టీటీడీ ద్వార ఆహ్వానం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అన్నారు.
నేడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ రాముల వారి ఆలయం నందు సీతాదేవి సమేత శ్రీరామచంద్ర మూర్తికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల, మేళాతాళాల నడుమ రామ నామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామి వారి ఊరేగింపు నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా కన్నులు విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాముని చిత్ర పట్టాన్ని రిక్షా పై ఉంచి ఊరోగించే తరుణంలో అక్కడున్నటువంటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు కాసేపు రిక్షా తొక్కుతూ స్వామివారికి రథసారధిగా మారారు. ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆసక్తి పరచింది…