రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భారత్, సోనియా గాంధీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని మిగతా 6 గ్యారంటీలను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే చేవెళ్ల సర్పంచ్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా సోనియా గాంధీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే లోకల్ భాడి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలపాలని అమె కోరారు. తెలంగాణా మహిళల తరుపున మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల ప్రయాణికులు మాట్లాడుతూ.. మేము ఎప్పుడు అనుకోలేదని ఇలాంటిది ఉచిత ప్రయాణం చేస్తామని అని చాలా సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
news
నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు. గృహ సముదాయాలు, విద్య సంస్థల సమీపంలో వైన్ షాపు ఎర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపు ఎదురుగా స్థానికులు డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలకు విధ్యార్థులు, విధ్యార్థినిలు వారి తల్లిదండ్రులు వస్తుంటారని దేవాలయం లాంటి విధ్యా సంస్థ ఎదురుగా అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు విధ్యార్థులు తిరిగే చోట మద్యం బాబులు మద్యం సేవిస్తూ రోడ్లు పై ఉంటే తివ్ర అంటాకం ఎర్పడుతుందన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా సానుభూతి పరుల ఓట్లు ఫారం 7 ద్వారా తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని నారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల మాటలకు అధికారులు తలోగ్గి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన ఓటరు ఎక్కడున్నా వచ్చి ఓటు వేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈరోజు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ దేవదేవుడుని పరమేశ్వరుడిని ప్రార్థించడమైనది. అలాగే సోనియాగాంధీ కి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల మ్యానిఫెస్టోలో ఈరోజు రెండు గ్యారంటీ పథకాలను అమలులోకి తీసుకుని వస్తున్నారు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సలీం పాష, మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి పింగళి రాకేశ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టే ప్రభుదాస్, బిసి సెల్ పట్టణ అధ్యక్షులు తంగెళ్ళ క్రిష్ణా మోహన్, కాంగ్రెస్ నాయకులు పోతుల శ్రీనివాస్, యం.డి సలీం, ముద్ధమల్ల రవి, NSUI రాష్ట్ర నాయకులు పర్లపెల్లి నాగరాజు, జిల్లా St cel కార్యదర్శి మానుపాటి సూర్య చిలువేరు రాజమౌళి, మొలుగూరి సమ్మయ్య, గుర్రపు మురళి, గుర్రపు ప్రవీణ్, గుల్లీ సమ్మయ్య, చిట్యాల శంకర్, పోతిరెడ్డి మల్లయ్య, సిరిపురం కుమార్, చెంచల శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య, గడ్డం రమేష్, అకినపెల్లి మహేందర్, రాజ్కుమార్ , అశోక్, దొడ్డె నవీన్, పాతకాలం అనిల్, పనికెల్లా శ్రీకాంత్, మొలుగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 200 మంది నీరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 77 వ జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రజల అండతో తెలంగాణ గెలుపును బహుమతిగా ఇచ్చామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే 6 గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ భీమా 10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించడం సంతోషమన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ పుట్టినరోజును పండగ లా జరుపుకుంటున్నారన్నారు.
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారo అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో, తీవ్ర గాయాలు పాలైన బెండి.సాయి( 24 ) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు. మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో, తన తల్లి చదివించి, పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం లో తుఫాను ప్రభావం వలన వర్షాలు పడటంతో మార్కాపురం లోని పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్ నత్తలు సందడి చేస్తూ కనిపించాయి. స్థానిక మాగుంట మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కు, అరుదైన జాతికి చెందిన ఆఫ్రికన్ నత్తలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఈ నత్తలు మొక్కలను, చెట్లను ఆహారం గా తీసుకుని పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయని పలువురు పర్యావరణ పరిరక్షకులు తెలిపారు. వెంటనే ఈ నత్తలను నివారించడానికి కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు .వాటిని అలాగే వదిలేస్తే వాటి సంఖ్య పెరిగి మొక్కలు మొత్తం సర్వనాశనం చేస్తాయని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆఫ్రికన్ నత్తలను నివారించడానికి ప్రయత్నం చేయాలన్నారు.
Read Also…
Read Also…
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి తేదీ: 8.12.2023 నాడు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం. సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ముజిబుస్సైని, పర్వతాలు, శంకర్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి అభినందనలు తెలిపారు. పది లక్షల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు & ఔట్సోర్షింగ్ ఉద్యోగుల కుటుంబాల తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్ తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టో లో చేర్చినందున ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడింది. కనుక ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తెలియజేశారు.






Total views : 91058