జిల్లా ఎస్పీ యూ.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు. నరసాపురం ఇంఛార్జి sdop జీ.వీ.ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ పోలీసు స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలోని చెరుకువాడకు చెందిన కోసూరి కరుణ (33సం) జల్సాలకు అలవాటు పడి రాత్రి పూట తాళాలు వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, మరియు వెండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా బైక్ లు దొంగతనాలకు కూడా పాల్పడేవాడని దొంగిలించిన వెండి, బంగారం వస్తువులను ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి తన అవసరాలకు ఉపయోగించుకునేవాడని తెలిపారు. పెనుగొండ ఇన్స్పెక్టర్ మరియు ఆయన సిబ్బందితో మరియు మధ్య వర్తులతో తేదీ.08-12-2013 తేదీన చెరుకువాడలో ముద్దాయి ఇంటి వద్ద సుమారు 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరచరిత్ర అంతా బయటపడింది. పట్టుబడిన కోసూరి కరుణ గత ఎనిమిది నెలల నుండి పాలకొల్లు మరియు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది .అతని నుంచి సుమారు 12.5 కాసుల బంగారం, ఒక కేజి వెండి ఒక మోటార్ సైకిల్ రూ. 8,00,000 లక్షల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరూ మోటార్ సైకిళ్ళుకు జీపీఎస్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇళ్లల్లో ఉన్న బంగారం మరియు నగదును వీలైనంత మేర బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
news
ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కు గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి పాట్నా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. వరి, అరటి, పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి. అప్పుచేసి పంట పండిస్తున్నామని ఈ విధంగా ఏనుగులు తొక్కి తిని నాశనం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కుప్పం వెళ్లే రహదారిపైనే కాసేపు ఏనుగులు ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, జెడ్పీ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం వాకాడుకు ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి ఉన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన తనయుడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు.
Read Also…
Read Also…
ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. జువెలరీ షాప్ కి వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గత అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల వెండి 16 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల సమక్షంలో క్లోస్ టీం సహాయంతో షాపులోని వేలిముద్రలు సేకరించారు. అలాగే సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Also….
Read Also….
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు. రెండు రోజులుగా అద్దె డబ్బులు కట్టకపోవడంతో తెల్లవారుజామున అద్దె కోసం రూమ్ బాయ్ తలుపులు తెరిచి చూడగా వ్యక్తి మృతి చెంది వికటజీవిగా పడి వున్నాడు. దీనితో లాడ్జ్ వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ రావు, వయసు 44 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడు గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలి శ్రీశైలంలో పలు హోటల్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చిన అందుకు స్థానిక పోలీసుల పర్మిషన్ కావాలని తెలిసిన కూడా రూల్స్ కి వెతిరేకంగా రూమ్ ఇవ్వడంపై పలు అనుమానాలు తవిస్తున్నాయి. అనుమానస్పద మృతి ఘటనపై కేసు నమోదు చేసిన సుండిపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ (సీతక్క) హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్క లు బాధ్యతలు చేపట్టారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) ములుగు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్కలకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5వ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా అంటూ రాజంపేట పట్టణంలో సందడి చేశారు. గతంలో అమలాపురం, రాయచోటి లో ఎంజీఆర్ షాపింగ్ మాల్ లను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంజీఆర్ షాపింగ్ మాల్ కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.
Read Also…
Read Also….






Total views : 90600