గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి క్రికెట్ పోరు జరగనుంది. ఇదివరకే భారత్ రెండు సార్లు క్రికెట్ కప్ గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఐదు పర్యాయాలు గెలుచుకొని కప్ కైవసం చేసుకుంది. మధ్యాహ్నం జరగనున్న పైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు రసవత్తరంగా తలపడనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అభిమానుల కోసం అన్ని జిల్లాల్లో భారీ స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల క్రికెటర్లు ప్రపంచ కప్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి కప్ ని భారత్ గెలుచు కుంటుందా లేక ఆస్ట్రేలియాకి కట్ట బెడుతుందా అన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ODI World Cup
నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం నేడు జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్ కొమ్ములు వంచి మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు. క్రికెట్ చరిత్రలో భారత్కు ఇది నాలుగో వరల్డ్ కప్ ఫైనల్. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్ కప్ ఫైనల్. ఇరుజట్లకు ఇది రెండో టైటిల్ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్ ఫేవరెట్. రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్కు భారత ప్రధాని మోడీ, ఆసీస్ ఉప ప్రధాని రిచర్డ్ మార్ల్స్ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. మైదానంలోని 1.30లక్షల మంది ప్రేక్షకులతోపాటు, కోట్లాది క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎయిర్ షో, డ్రింక్స్ ఇన్నింగ్స్ మధ్యలో సంగీత విభావరి, చివరగా లేజర్ షో ప్రదర్శించనున్నారు.
వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది. మొదట అతడు సెమీఫైనల్స్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడం కష్టంగా మారింది. దాంతో మిగిలిన టోర్నీకి హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండబోవడం లేదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిధ్ కృష్ణ భారత జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.





Total views : 75192