లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికి కోర్టు రెండు రోజుల కస్టడికి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ లో సురేష్ ను పోలీసులు ఇవ్వాళ, రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్ కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు.. చర్చలు ఏమిటన్నదానిపై పోలీసులు సురేష్ ను ప్రశ్నించనున్నారు.
మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు..దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనులనే రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తారని తెలుస్తోంది. దుగ్యాల మండలం నుంచి కలెక్టర్ సభను లగచర్లకు ఎందుకు మార్పించారన్నదానిపై నిందితుడి నుంచి వివరాలు రాబట్టనున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అధికారులపై దాడులు చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డి, లేక ఇంకెవరి ప్రోద్భలం ఉందన్న విషయాలపై సురేష్ ను ప్రశ్నించి కేసు విచారణను మరింత పగడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ ఎవరి పేర్లు బయటపెడుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90557