సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు. అయితే దీనికి ఎక్కువగా మొబైల్స్ చోరీకి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వాళ్లే.. CEIR లో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఫోన్ పోయిన వెంటనే CEIR లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ ట్రేస్ అవుతుందని…అప్పుడు ఫోన్ ఎక్కడ ఉందనేది సులభంగా పట్టుకోగలుగుతున్నామని డీసీపీ తెలిపారు. ఈ సంవత్సరంలో నాల్గవ సారి మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలోని 45 పోలీస్ స్టేషన్ల పరిధిలో అందరూ కష్టపడటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 7500 ఫోన్లు రికవరీ చేశామి.. ఈ సంవత్సరం 5వేల 5వందల ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ నర్సింహా సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91182