పిఠాపురం వీరవాడ రోడ్ బ్రాహ్మణ అగ్రహారం వద్ద జరుగుతున్న లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమానికి నాగేంద్రబాబు (Nagababu) హాజరయ్యారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికైన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో హిందువుల సొమ్ములు వక్రమార్గం పడుతున్నాయన్నారు. వక్స్ బోర్డ్ గాని క్రిస్టియన్ మిషనరీలు గాని ప్రభుత్వం ఆధీనంలో లేవన్నారు. కేవలం హిందూ దేవుళ్ళ గుళ్ళు మాత్రమే ప్రభుత్వం పెత్తనం చెలాయించడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. 90 శాతం హిందువులకే గుళ్ళు, గోపురాల పై ఆజామాసి ఉండాలి, కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం దీని మీద అబ్జర్వేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్ ఉండి ఉంటే కచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చే వారురన్నారు. కూటమి పార్టీ జనసేన అధికారంలోకి రాగానే ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…