వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో కూర్చొని అందినంత దోచుకున్నారని వారు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు వెండి బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Tag:
police commissioner
ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వులు మేరకు గిద్దలూరు ci దేవ ప్రభాకర్ కంభం సీఐ రాజేష్ గిద్దలూరు టౌన్ లోని అర్బన్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ అర్బన్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా 16 బైకులు రెండు ఆటోల కు సరైన లైసెన్సు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో కంభం మండలం సిఐ గిద్దలూరు మండలం సిఐ దేవ ప్రభాకర్ మరియు ఆరు మండలాల ఎస్సై లు పాల్గొన్నారు. అర్బన్ కాలనీ లోని వాసులకు సీఐ దేవ ప్రభాకర్ పలు అంశాలపై సూచనలు ఇచ్చారు.




Total views : 75269