ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో టీడీపీ కార్యాలయాన్ని షూట్ చేసి, ఆ తరువాత కార్యాలయం లోపలకు పంపే క్రమంలో డ్రోన్ కింద పడిపోయింది.
అప్రమత్తమయిన టీడీపీ నాయకులు నవీన్ ను పట్టుకుని పోలీస్ లకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తన ప్రచారాన్ని ముగించుకుని యర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులతో మాట్లాడి..అనుచరులతో కలసి శనివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు.
ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ తో మాట్లాడుతూ వైసీపీ కి చెందిన వారు ఉద్దేశ పూర్వకంగానే డ్రోన్ కెమెరా ను టిడిపి కార్యాలయం లోకి పంపే ప్రయత్నం చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో టీడీపీ నాయకులు తమ నాయకుడు ఎరిక్షన్ బాబు కు హాని చేయాలనే ఉద్దేశంతో నే వైసీపీ కి చెందిన వారు పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం కు చెందిన నవీన్ తో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలైన సూత్ర దారులను గుర్తించాలని సిఐ కు తెలిపారు.
డ్రోన్ ఎగుర వేసిన నవీన్ పై పోలీస్ లు కేసు నమోదు చేసారు. అర్ధరాత్రి ఎరిక్షన్ బాబు అనుచరులతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళటంతో రాజకీయ వేడిని రాజేసినట్లయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్ రచ్చప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
- జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 46180