Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Crime కారు-ఆటో ఢీ… మంటల్లో ఇద్దరు సజీవ దహనం..

కారు-ఆటో ఢీ… మంటల్లో ఇద్దరు సజీవ దహనం..

by Prakash
two burnt alive

ఆటోలో చెలరేగిన మంటలు(Two burnt alive)

ప్రకాశం జిల్లా(Prakasam district) బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతులంతా బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మంటలు చెలరేగి ఇద్దరు సజీవంగా కాలిపోయారు. మరొకరు ప్రమాదం జరిగిన సమయంలో ఎగిరి రోడ్డు పైన పడి అక్కడక్కడ మృతి చెందారు…

Follow us on :Facebook, Instagram&YouTube.

గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కొడుకు గురువయ్య, తండ్రి ఓబయ్య విజయవాడలో కొత్త ఇట్టిక కారు కొనుగోలు చేసి గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీ కొట్టింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రైతులుగా పోలీసులు గుర్తించారు. వీరు గుంటూరుకు వెళ్లి అక్కడ మిర్చి పంట అమ్ముకొని తిరిగి స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం బార్లకుంటకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆటో మార్కాపురం నుండి కొమరోలు కు పెళ్లి డెకరేషన్ సామాన్లు దించి తిరిగి మార్కాపురం వెళుతుండగా పూసలపాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ షేక్ ఖాసిం షా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం …
ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రియల్‌ …
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి …


Advertisements

You may also like

Our Visitor

009345
Total views : 61835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.