సదుం మండలం చెరుకువారిపల్లి కు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. చెరుకు వారి పల్లి గ్రామానికి చెందిన శరవణ వ్యాపారం చేసుకుంటూ చదుము లో కాపురం ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు అభినాష్ 14, అశ్విన్ 13లు ఆదివారం మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయన చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న పలువురు గమనించి వారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలను చదుము ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మారుతి సిబ్బంది పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇది చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ..!
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 79573