Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshChittoor ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

by Rama
Child died

సదుం మండలం చెరుకువారిపల్లి కు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. చెరుకు వారి పల్లి గ్రామానికి చెందిన శరవణ వ్యాపారం చేసుకుంటూ చదుము లో కాపురం ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు అభినాష్ 14, అశ్విన్ 13లు ఆదివారం మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయన చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న పలువురు గమనించి వారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలను చదుము ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మారుతి సిబ్బంది పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇది చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ..!


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: