తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు.
నీట మునిగిన వరి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, శనగ , ప్రత్తి,మినుము పంట పొలాలను సందర్శించారు. మోకాలు లోతులో నీరు ఉన్న పొలంలోకి వెళ్లి రైతుల నుండి ఎంత నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు. అదైర్యపడవద్దు, ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన నష్టపరిహాన్ని వచ్చే విధంగా టీడీపీ తరఫున పోరాటం చేస్తాము అని చెప్పారు. కాలవలలో పూడికతీత పనులు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ కొరకు కేటాయించిన భూములు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి ఈ ప్రాంతం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు . పూర్తిగా మొలిచిన తుమ్మ చెట్లతో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ramanjaneyulu
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరించి రైతు జీవితాలతో ఆడుకుందని దుయ్యబెట్టారు. గత ప్రభుత్వంలో వెంటనే వ్యవసాయ అధికారి ను గ్రామాల్లోకి పంపించి నష్టం నివారణ ఎక్కువ జరక్కుండా తగు చర్యలు తీసుకున్నామని, కానీ నేటి ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోగా కనీసం నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయటం లేదని ఎద్దేవా చేశారు. వదిలేసిన రైతులు సుమారు 50 వేల రూపాయలు నష్టపోయినట్టు, మెత్త పైడ్ చేసిన ఒక్కొక్క రైతు సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్టు రైతులు తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కింద వడివేసిన రైతులకు సుమారు 40000 రూపాయలు, మెట్ట పైరు వేసిన రైతులకు 70 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరంటీల్ ద్వారా నిజమైన నష్టపోయిన రైతులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నష్టం నివారణ నగదు వెళ్లిందని, కానీ నేడు అలా జరిగితే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకో చెయ్యిల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





Total views : 79498